బస్సులో బాంబు పేలి 10మంది సచివాలయ ఉద్యోగులు మృతి..

 

ఉగ్రవాదుల ఆగడాలకు అడ్డుకట్టు లేకుండా పోయింది. రోజు రోజుకి వీరి ఆగడాలు ఎక్కువవుతున్నాయే తప్పా తగ్గడంలేదు. తాజాగా మరో రక్తపాతం సృష్టించారు ఉగ్రవాదులు. పాకిస్థాన్‌లోని పెషావర్ పట్టణంలో 40 మంది ప్రయాణికులను తీసుకుని వెళ్తోన్న బస్సు సరద్ ప్రాంతంలోని మసీదు రోడ్డులో ఆగిన సమయంలో బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడు వల్ల బస్సు30 నుంచి 40 అడుగుల దూరం ఎగిరి పడినట్టు తెలుస్తోంది.  ఈ ఘటనలో 25 మృతిచెందగా మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. కాగా మృతుల్లో 10మంది పాక్‌ సచివాలయ ఉద్యోగులేనని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని స్థానిక లేడీ రీడింగ్‌ హాస్పిటల్‌కి చికిత్స నిమిత్తం తరలించారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu