ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఝలక్..


భూసేకరణ విషయంలో ఏపీ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన 660.83 ఎకరాలకు ఏపీ ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్‌ జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొంతమంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈరోజు దీనిపై విచారించిన కోర్టు.. పెనుమాక భూసేకరణ నోటిఫికేషన్‌ పై స్టేటస్‌ కో విధించింది. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని...వారి అభ్యంతరాలను పరిష్కరించాకే ముందుకెళ్లాలని, అప్పటివరకు యథాతథ స్థితి కొనసాగించాలని న్యాయస్థానం ఆదేశించింది.