ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఝలక్..


భూసేకరణ విషయంలో ఏపీ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన 660.83 ఎకరాలకు ఏపీ ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్‌ జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొంతమంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈరోజు దీనిపై విచారించిన కోర్టు.. పెనుమాక భూసేకరణ నోటిఫికేషన్‌ పై స్టేటస్‌ కో విధించింది. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని...వారి అభ్యంతరాలను పరిష్కరించాకే ముందుకెళ్లాలని, అప్పటివరకు యథాతథ స్థితి కొనసాగించాలని న్యాయస్థానం ఆదేశించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu