పీసీసీ పడవలో మరో 14మందికి చోటు

 

కాంగ్రెస్ అధిష్టానంతో ఎడతెగని చర్చలు చేసిచేసి అలసి సోలసిపోయిన పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ ఈరోజు సాయంత్రమే డిల్లీ నుండి విజయనగరం చేరుకొన్నారు. అయితే, ఆయనేమీ ఇంతవరకు ప్రజలు పండుగ చేసుకోనేంత గొప్ప వార్తలేవీ ఇంకా చెప్పలేదు. కానీ, తన పీసీసీ నౌకలో మరి కొంత తమందిని ఎక్కించుకొనేందుకు (కార్యవర్గ విస్తరణకు)అధిష్టానం అనుమతి తెచ్చుకొన్నారని మాత్రం సమాచారం వెలువడింది. 9మంది ప్రధాన కార్యదర్శులు,5 మంది ఉపాద్యక్షుల పోస్టులు భర్తీ చేసుకోనేందుకు బొత్స డిల్లీ నుండి అనుమతి తెచ్చుకొన్నారు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీలో 14మంది రాజకీయ నిరుద్యోగులకు లేదా అసమ్మతి నేతలకు ఉపాధి దొరుకుతుంది. ఇక రేపు డిల్లీ నుండి తిరిగి రానున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తన ప్రభుత్వంలో ఎటువంటి మార్పులు చేర్పులకు అనుమతి తెచ్చుకొంటారో వేచి చూడాలి. తరచూ ఇటువంటి డిల్లీ పర్యటనలతో బిజీగా ఉండే మన మంత్రులు రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ మార్క్ పాలన ఎలాగ ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు.