2019లో పోటీ చేస్తా..అసెంబ్లీలో చేనేత గొంతునవుతా

2019లో జరిగే ఎన్నికల్లో తాను పోటిచేస్తానన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అధికారం ఆశించి తాను రాజకీయాల్లోకి రాలేదని..పార్టీ పెట్టలేదని అన్నారు. సమాజంలో మార్పు కోసం..ప్రజలకు సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. శాసనసభలో చేనేతల గొంతు బలంగా వినిపిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు చిత్తశుద్ధి ఉన్న నాయకుల కోసం చూస్తున్నారని..కష్టాల్లో ఉన్నపుడే ఒక నాయకుడి అసలు రూపం బయటపడుతుందని పవన్ చెప్పారు. ప్రజల కోసం కష్టపడే అటువంటి నాయకుల కోసం తాను ఎదురుచూస్తున్నాని అన్నారు. తనకు ఒక్కరు ఓటేసినా, కోట్లాది మంది ఓట్లేసినా ప్రజల పక్షానపే నిలబడతానని హామీ ఇచ్చారు.