మను బాకర్‌కి మూడో పతకం మిస్!

పారిస్ ఒలింపిక్స్.లో ఇప్పటి వరకు 2 కాంస్యాలు గెలుచుకుని, మూడో పతకం కూడా గెలుచుకుంటుందన్న ఆశలు రేకెత్తించిన భారత యువ షూటర్ మను బాకర్‌కి నిరాశపరిచింది. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో పతకం జస్ట్ మిస్ అయి, నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మను బాకర్‌పై ఏర్పడిన అంచనాల వల్ల కావచ్చు, ఒత్తిడి వల్ల కావచ్చు 25 మీటర్ల పిస్టర్ విభాగం ఫైనల్లో స్టేజ్‌ వన్‌ని బాకర్ నెమ్మదిగా ప్రారంభించింది. కొద్దిసేపటి తర్వాత పుంజుకుని రెండో స్థానానికి ఎగబాకింది. అయితే హంగేరీ దేశానికి  చెందిన మేజర్ వెరోనికా అత్యుత్తమ ప్రదర్శన చేయడంతో ఆమె మూడో స్థానానికి చేరుకుని, మను బాకర్ నాలుగో స్థానానికి జారిపోయింది. దాంతో మను బాకర్ మూడో పతకం చేజారిపోయింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu