మంత్రిపై కాల్పులు.. కారుకి అడ్డంగా వచ్చి


పాకిస్థాన్ మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి సోరన్ సింగ్ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపి చంపారు. వివరాల ప్రకారం.. సోరన్ సింగ్ కారులో ప్రయాణిస్తుండగా కొంత మంది దుండగులు బైక్ పై వచ్చి అతని కారుకు అడ్డంగా పెట్టి అతనిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో సోరన్ సింగ్ అక్కడికక్కడే మరణించారు. ఈ విషయాన్ని మరో మంత్రి అధికారికంగా ధ్రువీకరించారు. కాగా ఈ పని చేసింది తాలిబన్ ఉగ్రవాదులే అని అధికారులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News