ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ప్రమాదం.. మాజీ డీజీపీ మనవడు మృతి


హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించినట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం రాజేంద్రనగర్‌ మండలం కోకాపేట చౌరస్తా దగ్గర స్కోడా కారులో వరుణ్ పవార్ తో పాటు మరో నలుగురు  గచ్చిబౌలి నుంచి కారులో శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్తున్నారు. ఇంతలో కారు అదుపు తప్పి వెనుక నుండి మిల్క్ ట్యాంకర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అవిత్ పవార్, వరుణ్ పవార్, జ్ఞాన్ దేవ్, పవన్ లు అక్కడికక్కడే మరణించారు. కాగా చనిపోయిన వారిలో వరుణ్ పవార్ మాజీ డీజీపీ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు పేర్వారం రాములు మనవడుగా తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu