ఏపీ మంత్రి తండ్రి హత్య..నిందుతుడు అరెస్ట్

 

గత ఏడాది అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు ని, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు విశాఖ జిల్లా డుంబ్రిగూడ మండలం లిప్పట్టిపుట్ట వద్ద అతి కిరాతకంగా కాల్చి చంపిన విషయం విదితమే. కాగా ఈ హత్య కేసులో నిందితుడు డొండురు కిలోను ఒడిశా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఒడిశాకు చెందిన పాడువా పోలీసులు నిన్న రాత్రి డొంబురు కిలోని అరెస్ట్‌ చేసినట్లు తెలిసింది. కొరాపుట్‌ జిల్లా పాడువా అటవీప్రాంతంలో ఆయన్ను అరెస్ట్‌ చేశారు. నిందితుడిని పోలీసులు ఎన్‌ఐఏ అధికారులకు అప్పగించనున్నారు. హత్య ఉదంతం అనంతరం ఏపీ-ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా సరిహద్దుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. హంతకుల కోసం అన్వేషణ కొనసాగించారు. చివరికి నిందితున్ని అరెస్ట్ చేశారు. మరోవైపు కిడారి సర్వేశ్వరావు హత్యకి గురవ్వడంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుమారుడు కిడారి శ్రావణ్ ని తన క్యాబినెట్ లోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ప్రాథమిక ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ శాఖా మంత్రిగా కొనసాగుతున్నారు.