ఫ్రాన్స్‌పై మరోసారి ఉగ్రపంజా..భగ్నం చేసిన పోలీసులు

ఉగ్రవాద దాడులతో ఫ్రాన్స్ వణికిపోతోంది. బ్యాస్టిల్ డే సెలబ్రేషన్స్‌ను లక్ష్యం గా చేసుకుని నీస్ నగరంలో జరిగిన మారణకాండను మరచిపోకముందే మరోసారి ఉగ్రవాదులు పంజా విసిరారు. ఇద్దరు సాయుధులైన దుండగులు ఉత్తర ఫ్రాన్స్‌లోని నార్మాండిలోని ఒక చర్చిలోకి చొరబడి అక్కడి వారిని బందీలుగా చేసుకున్నట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన భద్రతా దళాలు చర్చి ఉన్న ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేసి ఆపరేషన్ ప్రారంభించాయి. ఉగ్రవాదులు బందీలుగా చేసుకున్న వారిలో ఒక ఫాదర్, ఇద్దరు నన్స్ మరో ఇద్దరు భక్తులు ఉన్నట్లుగా తెలుస్తోంది.