కాళేశ్వరం నిర్మాణ సంస్థకు నో క్లియరెన్స్ సర్టిఫికేట్ 

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థకు ఇచ్చే క్లియరెన్స్ సర్టిఫికేట్ ను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలపై న్యాయ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. రేవంత్ సర్కారు వేసిన ఈ కమిషన్  రద్దు చేయాలని ఇప్పటికే బిఆర్ఎస్ న్యాయస్థాన్ని ఆశ్రయించింది. రద్దు చేయడం కుదరదని న్యాయస్థానం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో విజెలెన్స్ శాఖ నివేదిక తయారు చేసింది. ఈ నివేదిక విచారణ చేపడుతున్న కమిషన్ కు చేరకముందే నిర్మాణ సంస్థకు ఇచ్చిన  క్లియరెన్స్  సర్టిఫికేట్ ను ప్రభుత్వం రద్దు చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజిలు కుంగిపోవడంతో తిరిగి అదే సంస్థ మరమ్మత్తులు చేసిన తర్వాతే క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలని నిర్ణయించింది.  ఈ ప్రాజెక్టులో పని చేసిన ఇంజినీర్లకు ప్రభుత్వం నిలుపుదల చేసింది. డ్యామ్ సేప్టీ అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని ప్రభుత్వం భావిస్తుంది. బహిరంగ విచారణకు ఈ బ్యారేజికి చెందిన ఆరుగురు ఇంజినీర్లు విచారణ కమిషన్ ముందు హాజరుకానున్నారు. బుధవారం నుంచి ఈ నెల 25 వరకు కమిషన్ విచారణ జరగనుంది.  ఇప్పటికే 15 మంది ఇంజినీర్లను కమిషన్ విచారించింది. ప్రభుత్వానికి విచారణ కమిషన్ ఇచ్చిన నివేదిక తర్వాత బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu