మోడీని ఏమన్నా అంటే చేతులు, వేళ్లు నరికేస్తాం...
posted on Nov 21, 2017 4:26PM
ఇప్పటికే బీజేపీ పార్టీ మతత్వపు పార్టీ అన్న ముద్ర పడిపోయిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నో ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. దళితులపై కొట్లాటలు కానీ.. దేశంలో అసహనం కానీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే వచ్చాయి అని ఇప్పటికే కొంతమంది విమర్శిస్తున్నారు. ఇప్పుడు వాటికి తోడు.. భారతీయ జనతా పార్టీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీకి చెడ్డపేరు తీసుకొస్తున్నారు. తాజాగా బీజేపీ బీహార్ అధ్యక్షుడు, ఎంపీ నిత్యానంద రాయ్ అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కారు. ఈయనగారు ఏకంగా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని వేలెత్తి చూపే వారి చేతులు, వేళ్లు నరికేస్తామని హెచ్చరించారు. నరేంద్ర మోదీ పేదరికాన్ని జయించి ప్రధానమంత్రి అయ్యారని, మనుషుల మధ్య అభిప్రాయబేధాలు సహజమని, దేశంలో వాటికి విలువ ఇవ్వాల్సిందేనని వింతగా మాట్లాడారు. మోదీనికి ఏమైనా అంటే నరకడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. దీంతో ఇప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగుతుంది.