ఐఓసీ సభ్యురాలిగా నీతా అంబానీ.. తొలి మహిళగా రికార్డ్

 

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీకి అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సభ్యురాలిగా భారత్ తరఫున ఆమె నామినేట్ అయ్యారు. దీంతో ఆగస్టు 2 నుంచి 4 వరకు రియోడీజనిరోలో జరగనున్న ఐఓసీ సెషన్ ఎన్నికల్లో ఆమె బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో నీతా విజయం సాధిస్తే... ఐఓసీలో అడుగుపెట్టిన తొలి భారత మహిళా సభ్యురాలిగా రికార్డులకెక్కనున్నారు. ఎన్నికలో నీతా విజయం సాధిస్తే... ఆమెకు 70 ఏళ్లు వచ్చేదాకా అందులో సభ్యురాలిగా కొనసాగనున్నారు. కాగా ఇప్పటికే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ పేరిట ఓ క్రికెట్ జట్టును కొనుగోలు చేసిన నీతా... క్రీడలపై అమితాసక్తి కనబరుస్తున్న సంగతి తెలిసిందే.