అలాంటి వాటిపై వివరణ అడిగితే కేసు పెడతాం.. నాయిని
posted on Oct 23, 2015 5:08PM

తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చంచల్ గూడ జైలులో రూ 10 కోట్లతో నిర్మించిన కొత్త కాంప్లెక్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఫైర్ అయ్యారు. కొత్త కాంప్లెక్స్ ప్రారంభించడానికి వచ్చిన నాయినితో ఓ విలేకరి.. కాంప్లెక్స్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న వార్తలపై మీ వివరణ ఏంటీ అని అడిగాడు. అంతే నాయిని కోపం ఒక్కసారిగా నషాళానికి అంటి మీడియా విలేకరులపై మండిపడ్డారు. ఇలాంటి గాలి వార్తలపై వివరణ అడిగితే కేసులు పెడతామంటూ హెచ్చరించారు. దీంతో షాకవ్వడం విలేకరుల వంతయింది. అనంతరం మాట్లాడుతూ ఖైదీల్లో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని.. జనవరి 26న మంచి ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేస్తామని.. ఖైదీల్లో సత్ర్పవర్తన వచ్చేలా జైళ్ల శాఖ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు.