కర్నూలులో జాతీయ పతాకం ఆవిష్కరించిన చంద్రబాబు

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్నూలులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించింది. ఈ వేడుకలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలలో పలువురు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.