చంద్రబాబు కన్నా మిల్క్ బెస్ట్ - నాగబాబు

 

‘మై ఛానల్ - నా ఇష్టం’ అంటూ మెగా బ్రదర్ నాగబాబు ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టి రాజకీయా నాయకులపై సెటైర్లు వేస్తున్నారు. ఇటీవల ఏపీ మంత్రి నారా లోకేష్ ని టార్గెట్ చేసిన నాగబాబు...తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై సెటైర్లు వేశారు. ఇటీవల అసెంబ్లీలో చంద్రబాబు బీజేపీ నేతలపై ఫైర్ అవుతున్న వీడియోను పోస్ట్ చేసిన నాగబాబు.. చంద్రబాబు రక్తం మరగడానికి నాలుగున్నరేళ్లు పట్టిందంటూ సెటైర్ వేశారు. ‘చూడండిరా పాలు మరిగిపోతున్నాయి.. చూడండి’ అని పాలు మరిగే దృశ్యాన్ని ‘నా ఛానల్ - నా ఇష్టం’ వీడియోలో నాగబాబు చూపించారు. తరువాత చంద్రబాబు.. ఇటీవల అసెంబ్లీలో బీజేపీ నేతలపై ఫైర్ అవుతున్న వీడియోను చూపించారు. అనంతరం.. ‘చూశారుగా.. పాలు మరగటానికి నాలుగున్నర నిమిషాలు పట్టింది. అదే మరి మన సీఎంగారి రక్తం మరగటానికి నాలుగున్నరేళ్లు పట్టింది. ఎక్కువ మంట పెడితేనే పాలు మరుగుతాయి. ఎలక్షన్లు వస్తేనే మన చంద్రబాబు నాయుడుగారి రక్తం మరుగుతుంది’’ అని వీడియోలో పేర్కొన్నారు. నాగబాబు కామెంట్లని నేతలు పెద్దగా పట్టించుకోవట్లేదనుకుంటా అందుకే ఎవరూ ఏం రియాక్షన్ ఇవ్వట్లేదు.