నిరూపిస్తే రాజీయాలనుండి తప్పుకుంటా


 

ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి పై గతంలో దాడి జరిగినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పుడు జేసీ శర్మ కమిటీ విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో విచారణ జరుపుతున్నారు. దీనిలో భాగంగా వనజాక్షి కమిటీ ముందు తన వాదనలు వినిపించింది. అనంతరం చింతమనేని ప్రభాకర్ తన వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఆయన ఈ దాడిలో తనకు సంబంధం లేదని.. వనజాక్షి తన సరిహద్దులు దాటి ఇసుక ర్యాంపులోకి వచ్చారని అన్నారు. అంతేకాని తాను ఆమెపై ఎటువంటి దాడి చేయలేదని ఒక వేళ తాను చేసినట్టు నిరూపిస్తే రాజకీయలనుండి తప్పుకుంటానని కమిటీ ముందు చెప్పినట్టు తెలుస్తోంది. తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఈప్రచారం చేయడం వెనుక కుట్రలు వున్నాయని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu