కిర్లంపూడిలో ఉత్కంఠత!

కాపులకు రిజర్వేషన్లను సాధించేందుకు ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ దీక్ష రెండో రోజుకి చేరుకుంది. తన దీక్షను ప్రశాంతంగానే కొనసాగిస్తాననీ, తనకు మద్దతుగా ఎవరూ కిర్లంపూడికి చేరుకోవద్దనీ ముద్రగడ చెప్పినప్పటికీ, ముద్రగడ ఇంటి ముందర ఉద్యమ వాతావరణ నెలకొని ఉంది. ముద్రగడ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. అయినా దీక్ష కారణంగా కిర్లంపూడి మొత్తం కర్ఫ్యూ వాతావరణం నెలకొని ఉంది. అయితే నేడు ప్రభుత్వం ముద్రగడతో చర్చలు జరపనుందని తెలియడంతో ఇవాళ సాయంత్రానికి ముద్రగడ తన దీక్షను విరమించే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మల్సీ బొడ్డు భాస్కరరామారావు ఒకటికి రెండుసార్లు ముద్రగడను కలిసి ప్రభుత్వం తరఫున పరిస్థితిని సానుకూలంగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నారు.