రేపు విశాఖకు వస్తున్న మోడీ

 

హుదూద్ తుఫాన్ విశాఖపట్టణాన్ని అల్లకల్లోలం చేసింది. విశాఖపట్టణంలో ఇప్పుడు వాతావరణం చాలా భయానకంగా వుంది. ఎక్కడ చూసినా చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి కనిపిస్తున్నాయి. రోడ్లన్నీ కొట్టుకుపోయి వున్నాయి. ఇప్పుడిప్పుడే నగర ప్రజలు బయటకి వస్తున్నారు. తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి వుంది. కరెంటు లేదు. కమ్యునికేషన్ వ్యవస్థ కుప్పకూలింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. విశాఖలోని పరిస్థితిని ఎప్పటికప్పుడు తాను తెలుసుకుంటున్నానని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కూడా ఫోన్‌లో మాట్లడానని చెప్పారు. విశాఖ ప్రజలకు అండగా వుండటానికి మంగళవారం నాడు తాను విశాఖను సందర్శించనున్నానని నరేంద్ర మోడీ ట్విట్టర్లో తెలిపారు.