ఎపి సిఎం జగన్ కు ప్రధాని మోడీ ఫోన్ కాల్

 ముఖ్యమంత్రి   వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి  ప్రధాని నరేంద్ర మోదీ ఈ సాయంత్రం ఫోన్ చేసి, కోవిడ్ _19 నివారణా, నియంత్రణ చర్యల గురించి మాట్లాడారు. ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ లో , ఎక్కువగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో తీసుకుంటున్న కరోనా నియంత్రణ చర్యల గురించి ప్రస్తావన వచ్చినట్టు సమాచారం.  కరోనా వ్యాధిని ఎదుర్కోవటంలో ఎపి ప్రభుత్వం శాస్త్రీయంగా ముందుకు సాగటం లేదని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. మొదట్లో  స్థానిక ఎన్నికల ఊపులో ఉండి కరోనా ను అశ్రద్ధ చేశారు. తీరా పరిస్థితిని గుర్తించిన తర్వాత కూడా తగిన రీతిలో స్పందించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని కూడా విపక్ష నాయకులు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో , ప్రధాని-ముఖ్యమంత్రి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ప్రాధాన్యం సంతరించుకుంది.