ఆంధ్రప్రదేశ్ లో 252 కి చేరిన కోవిడ్-19 పాజిటివ్ కేసులు

* కరోనా పాజిటివ్ తో 1 మరణం నమోదు

* ఆదివారం ఒక్కరోజే 60 కొత్త కేసులు నమోదు

* ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం లో ఇప్పటి వరకు నమోదు కాని కరోనా పాజిటివ్ కేసులు

ఈరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు నమోదైన పరీక్షల్లో ఒక్క కర్నూలులో 26 పాజిటివ్ కేసులు. జిల్లాల వారిగా ఇప్పటి వరకు నమోదు అయిన కేసుల వివరాలిలా ఉన్నాయి. అనంతపురం - 3, చిత్తూరు - 17, తూర్పుగోదావరి - 11, గుంటూరు - 30, కడప - 23, కృష్ణ - 28, కర్నూలు - 53, నెల్లూరు - 34, ప్రకాశం - 23, శ్రీకాకుళం - 0, విశాఖపట్నం - 15 , విజయనగరం - 0, పశ్చిమగోదావరి - 15. ఈ రోజు వరకు నమోదైన కేసులలో విదేశాల నుంచి వొచ్చిన వాళ్ళు 11. వారి కాంటాక్ట్స్ 6 మరియు వైరస్ లక్షణాలతో చేరిన వాళ్ళు మరో ఆరుగురు ఉన్నట్టు సమాచారం.