22 మంది సీఈఓలతో మోదీ



ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజుల చైనా పర్యటనలో భాగంగా షాంఘై చేరుకున్నారు. అక్కడ 22 మంది సీఈవోలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తయారీ రంగాన్ని ప్రోత్సహించడం వల్ల యువతకు ఉపాధి కల్పించవచ్చని,  "మేక్ ఇన్ ఇండియా" కార్యక్రమం ద్వారా భారత్ లో వస్తువులు ఉత్పత్తి చేస్తామని తెలిపారు. భారత్, చైనా దేశాలు భాగస్వామ్యులైతే ఆసియాలో రాజకీయ స్ధిరత్వం, ఆర్ధిక అభివృద్ధి మెరుగుపడుతుందని అన్నారు. రైల్యేలను ఆధునీకరిస్తామని, 50 నగరాల్లో మెట్రో రైలుకు ప్రణాళికలున్నాయని మోదీ తెలిపారు. భారత సంస్కృతి సంప్రదాయాలను చైనాకు పరిచయం చేసిన విధ్వాంసులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని, మోదీ అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu