చంద్రబాబు అస్తమించే సూర్యుడు..

వైసీపీ ఎమ్మెల్యే రోజా టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు. మీడియా సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ అన్ని వర్గాల వారిన చంద్రబాబు మోసం చేశారని ఆమె అన్నారు. ఇప్పటికే చాలామంది టీడీపీ నేతలు టీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు.. ఇక ఆపార్టీకి మిగిలేది ఇద్దరు మాత్రమే అని ఎద్దేవ చేశారు. మా పార్టీలో ఎమ్మెల్యేలు ఎవరూ టీడీపీలోకి వెళ్లడం లేదు.. టీడీపీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోంది..భయపెట్టి పార్టీల్కోకి లాక్కోవాలని చూస్తున్నారు..అయినా కూడా ఎవరూ చంద్రబాబు దగ్గరకు వెళ్లడం లేదని అన్నారు. చంద్రబాబు అస్తమించే సూర్యుడు.. జగన్ ఉదయించే సూర్యుడు అని విమర్శించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu