చనిపోయిన భార్యతో 5 సంవత్సరాలుగా

 

నిజ జీవితంలో కాని, సినిమాల్లో కాని మనం చాలా ప్రేమ కథలు చూసుంటాం. అలాంటి ప్రేమ చాలా స్వచ్చమైనది.. ఎవరూ మరువలేనిది.. విడదీయలేనిది. కానీ ఇక్కడ ఓ భర్త భార్య మీద చూపించిన ప్రేమ అందరిని భయభ్రాంతులకు గురి చేసింది. అంతలా ఆ భర్త ఏ ప్రేమ చూపించాడనేగా మీ డౌట్.. ఈ సంఘటన చూస్తే మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది. ఈ సంఘటన వియత్నంలో జరిగింది. వియత్నంలోని క్వాంగ్ నామ్ ప్రావిన్స్ వద్ద 55 ఏళ్ల ఓ వ్యక్తి భార్య చనిపోయింది. అయితే అతను మాత్రం తన భార్య చనిపోవడం ఏ మాత్రం తట్టుకోలేక పోయాడు. తన భార్యతో తాను కూడా చనిపోదామా అనుకుంటే తనకు కొడుకు ఉండటంతో అటు చావలేక బ్రతలేక తన భార్య సమాధివద్దనే దాదాపు రెండు సంవత్సరాలు గడిపాడు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది.. అలా ఎంతకాలం సమాధి దగ్గర ఉండాలనుకున్నాడేమో అతను తన భార్య సమాధి తవ్వి ఆమె హస్తికలు ఇంటికి తీసుకొచ్చి వాటిని కాగితం మట్టితో అచ్చు శరీరంలా తయారు చేసి ముఖానికి మాస్క్, ఇంకా డ్రస్స్ కూడా వేశాడు. అలా ఐదు సంవత్సరాలుగా అతను.. తన కొడుకు కూడా చనిపోయిన తన భర్య పక్కనే పడుకుంటున్నారట. ఒక పక్క భయం వేసిన మరోపక్క అతను చేసిన పని అతని భార్యపై ఉన్న ప్రేమ ఎంతో గొప్పదో కనిపిస్తుంది.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu