పిసిసి అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ నియామకం

తెలంగాణ  ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ నియామకమయ్యారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పదవికి మరో కాంగ్రెస్ నేత మధుయాష్కి గౌడ్ పోటీ పడ్డారు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఇకనుంచి ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తారని ఎఐసిసి పేర్కొంది. రెండు వారాలక్రితమే పిసిసి అధ్యక్ష పదవికి మహేష్ కుమార్ గౌడ్ పేరు అనధికారికంగా ఖరారైనప్పటికీ శుక్రవారం అధికారికంగా ఖరారైంది. మహేష్ నియమితులైన తర్వాత రేవంత్ రెడ్డి పిసిసి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu