మొదలెట్టిన మహేష్ ఆగడు

 

మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం "ఆగడు". ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు ఈరోజు ఉదయం 8:09ల సమయంలో రామానాయుడు స్టుడియోలో జరిగాయి. ఈ చిత్రంలో మహేష్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించనున్నది.14రీల్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో రామ్ ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నాడు.థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. పూర్తి కమర్షియల్, కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ ఎన్ కౌంటర్ శంకర్ పాత్రలో నటించనున్నాడు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నెలలో ప్రారంభం కానుంది.