మహానాడులో ఎమ్మెల్యే డబ్బులు కొట్టేసిన దొంగ అరెస్ట్..

 

టీడీపీ మహానాడు సభలు మూడురోజులు ఘనంగా జరిగాయి. కొన్ని వేలమంది టీడీపీ నేతలు ఈ సభలకు హాజరయ్యారు. అయితే పనిలో పనిగా పిక్ పాకెటర్స్ కూడా చాకచక్యంగా తమ చేతికి పనిచెప్పారు. అలా ఒక ఎమ్మెల్యే డబ్బులు కాజేసి దొరికిపోయాడు ఓ దొంగ. మహానాడు సభకు బద్వేలు ఎమ్మెల్యే జయరాములు కూడా వచ్చారు. అయితే సభకు వచ్చిన ఆయన దగ్గర నుండి డబ్బులు కాదు. దాదాపు 95 వేల రూపాయలు దొంగలు కాజేశారు. దీంతో సదరు ఎమ్మెల్యే డబ్బు పోయిందని పోయిందని జయరాములు ఫిర్యాదు చేయగా, దాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు దొంగల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మహానాడు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు అన్నీ పరీశీలించి ఆఖరికి దొంగలను కనిపెట్టారు. జయరాములు వెనుక ఇద్దరు వ్యక్తులు కదలాడుతున్నారని.. వారే దొంగలని గుర్తించి వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే నుంచి దొంగిలించిన సొమ్మును రికవరీ చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu