మ్యాగీపై నిషేదం ఎత్తివేత

 

నెస్లే ఇండియాకు చెందిన మ్యాగీ నూడిల్స్ లో హానికర పదార్ధాలున్నాయంటూ పలు రాష్ట్రాల్లో బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపైన మహారాష్ట్ర ప్రభుత్వం కూడా నిషేదం విధిచింది. అయితే ఇప్పుడు ఈ వ్యవహారంపై నెస్లే ఇండియాకు ముంబై కోర్టులో ఊరట లభించింది. మ్యాగీ పై నిషేదం విధించడంపై ముంబై హోకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో దీనిపైన విచారణ జరిపిన హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వ మ్యాగీపై విధించిన నిషేధాన్నిఎత్తివేసింది. మరోసారీ నూడుల్స్ నమూనాలపై పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతి బ్యాచులో ఐదేసి శాంపిల్స్‌ను మూడు ల్యాబ్‌లకు పంపించి పరీక్షించాలని, ఆరువారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu