‘మా’ ఓట్ల లెక్కింపుకి లైన్ క్లియర్

 

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కి ఇటీవల ఎన్నికల జరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం నాడు ‘మా’ ఎన్నికల ఓట్లను కౌంటింగ్ చేసుకోవచ్చని కోర్టు అనుమతి ఇచ్చింది. ‘మా’ ఎన్నికల నిర్వహణపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్‌ని కోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్ దాఖలు చేసిన నటుడు ఒ.కళ్యాణ్ మీద కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు అతనికి జరిమానా కూడా విధించింది. బుధవారం నాడు కోర్టు ఇచ్చిన తీర్పుతో ఇప్పటి వరకూ ‘మా’ ఎన్నికల విషయంలో ఏర్పడిన గజిబిజి పరిస్థితి తొలగిపోయింది. ప్రతి సంవత్సరం ‘ఏకగ్రీవం’గా జరిగిపోయే ‘మా’ ఎన్నికలు ఈసారి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో జరిగాయి. అధ్యక్ష పదవి కోసం పోటీలో వున్న జయసుధ, రాజేంద్ర ప్రసాద్ వర్గాలు ఒకరినొకరు దూషించుకుంటూ మీడియాకి ఎక్కారు. ఈ ఎన్నికల ప్రక్రియ ఇంతలా వేడి ఎక్కడంతో, ప్రజలకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ ‘మా’ ఎన్నికల మీద సాధారణ ప్రజల్లో కూడా ఆసక్తి ఏర్పడింది. మరి శుక్రవారం జరిగే కౌంటింగ్‌లో ఎవరు విజయం సాధిస్తారన్న ఉత్కంఠ మాత్రమే ప్రస్తుతానికి మిగిలి వుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu