తలలు పగిలినా వైసీపీ, టీడీపీ ఘర్షణ...

 

కర్నూలు జిల్లా డోన్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మున్సిపాలిటీ దుకాణాల వేలంలో టీడీపీ, వైసీపీ వర్గాలు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఒకపక్క తలలు పగిలి రక్తం కారుతున్నా కానీ విచక్షణారహితంగా కొట్టుకున్నారు. ఈ దాడుల్లో ఐదుగురు వైసీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు.