మోడీ డ్రీమ్ ప్రాజెక్ట్ లో మహిళా ఐఏఎస్..
posted on Mar 24, 2017 4:00PM
ప్రధాని మోడీ కలల ప్రాజెక్టులో ఉత్తరప్రదేశ్ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ బి. చంద్రకళకు కీలక బాధ్యతలు దక్కాయి. ప్రస్తుతం మీరట్ కలెక్టర్గా పనిచేస్తున్న చంద్రకళ.. అవినీతి పరులపై కొరడా ఝుళిపిస్తూ, సమర్థవంతమైన అధికారిణిగా పేరు తెచ్చుకున్నారు. దీంతో చంద్రకళ ప్రతిభను, నిజాయితీని, అంకితభావాన్ని గుర్తించిన మోడీ.. ఆయన కలల ప్రాజెక్ట్ అయిన 'స్వచ్ఛ భారత్ మిషన్' డైరెక్టర్గా ఆమెను నియమించారు. అలాగే తాగునీరు, పారిశుద్ధ్య శాఖ డిప్యూటీ సెక్రటరీగా కూడా బాధ్యతలు నిర్వహిస్తారు.
కాగా 2008 బ్యాచ్కు చెందిన బి. చంద్రకళ ఇంతకుముందు బిజ్నూర్, బులంద్షార్ జిల్లాలకు కలెక్టర్గా పనిచేశారు. రెండేళ్ల క్రితం ఆమె అవినీతి అధికారులు, కాంట్రాక్టర్ల భరతం పడుతూ కఠిన చర్యలు తీసుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఆమె బాగా పాపులర్ అయ్యారు.