రేవంత్ అరెస్ట్ పై స్పందించిన కేటీఆర్

 

కొడంగల్ లో తెరాస అధినేత కేసిఆర్ సభను అడ్డుకుంటానని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయగా.. ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా రేవంత్ అరెస్ట్ పై కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషనే సుప్రీం. కొడంగల్ లో సీఎం కేసీఆర్ సభకు రేవంత్ రెడ్డి ఆటంకం కలిగిస్తారనే ముందస్తు అరెస్టుకు ఎన్నికల కమిషనే ఆదేశించింది. మహాకూటమి తరపున ఏపీ సీఎం చంద్రబాబు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేయొచ్చు. కానీ, సొంత రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం చేస్తే అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.