ఈడీ కార్యాలయంలో కెటీఆర్ విచారణ 

ఫార్ములా ఈ రేస్ కేసులో  మాజీ మంత్రి  కెటీఆర్ గురువారం బషీర్ బాగ్ లోని ఈ డీ కార్యాలయానికి చేరుకున్నారు. గచ్చిబౌలిలోని  తన నివాసం నుంచి కెటీఆర్ నేరుగా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. కెటీఆర్ ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరైన సమయంలోనే  కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు చేశారు. ఇప్పటికే ఐఏఎస్ అరవింద్ కుమార్,  చీఫ్ ఇంజినీర్ బిఎల్ఎన్ రెడ్డిలను  విచారించిన ఈడీ కెటీఆర్ ను విచారిస్తోంది. ఫార్ములా ఈ రేస్ లో భారీ అవినీతి జరిగిందని రేవంత్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. విచారణకు హాజరయ్యే ముందు కెటీఆర్ ఓ ట్వీట్ చేశారు. హైదరాబాద్ ప్రతిష్టను పెంచడానికి ఫార్ములా ఈ రేస్ నిర్వహించామని ఒక్క రూపాయి అవినీతి జరగలేదన్నారు.