కృష్ణా జిల్లా 48 గంట‌ల బంద్‌

 

స‌మైక్యాంద్ర కోరుతూ సీమాంద్ర ప్రాంతాల్లో ఆందోళ‌న‌లు మిన్నంటుతున్నాయి. రాష్ట్ర విభ‌జ‌న‌ను వ్యతిరేకిస్తూ ఇప్పటికే ప‌లు ర‌కాలుగా నిర‌స‌న‌లు తెలుపుతున్న ప్రజ‌లు ఇప్పుడు బంద్‌కు పిలుపు నిచ్చారు. 48 గంట‌ల పాటు కృష్ణా జిల్లాలో స‌కలం బంద్ కానున్నాయి. అత్యవ‌స‌ర సేవ‌లు మిన‌హా వ‌ర్తక‌, వాణిజ్య, వ్యాపార‌, ర‌వాణా లాంటి విభాగాల‌న్ని బంద్‌లో పాల్గొన‌నున్నాయి.

ఈ రోజు భారీ బైక్ ర్యాలీతో పాటు కెసిఆర్ దిష్టిబొమ్మను ద‌హనం చేసిన స‌మైక్యాంద్ర ఉద్యమ‌కారులు, బుధ‌వారం నుంచి 48 గంట‌ల బంద్‌కు పిలుపునిచ్చారు. ఈబంద్ ఇప్పటికే ప‌లు సంఘాలు స‌హ‌క‌రిస్తుండ‌గా, రాజ‌కీయ పార్టీలు కూడా మ‌ద్దతు తెలుపుతున్నాయి.