జగన్ గంగలో దూకితే నేను దూకుతా.. కొడాలి నాని



గుడివాడలోని వైసీపీ కార్యలయం వివాదం నేపథ్యంలో కొడాలి నాని టీడీపీ నేతలపై ఫైర్ అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం నన్ను టార్గెట్ చేసిందని అన్నారు. వైఎస్సార్ సీపీ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని.. భూమారెడ్డి, రోజాను కూడా టార్గెట్ చేశారు అని వ్యాఖ్యానించారు. నేను రెండు నెలల్లో భవనం ఖాళీ చేసి యజమానురాలికి ఇస్తానని చెప్పాను.. ఇంతలోనే టీడీపీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని.. దమ్ముంటే 2019 ఎన్నికల్లో గుడివాడ నుండి చంద్రబాబు పోటీ చేయాలని అన్నారు. ఎంత మంది బుద్దా వెంకన్నలు వచ్చినా ఎవరికీ భయపడనని చెప్పారు. త్వరలోనే నా విశ్వరూపం చూపిస్తా అని.. రాజకీయాల్లో ఉన్నంతకాలం జగన్ తోనే ఉంటాం.. జగన్ గంగలో దూకితే నేను కూడా గంగలో దూకుతా.. ఒకవేళ జగన్ ను వీడాల్సి వస్తే రాజకీయాలనుండే తప్పుకుంటా అని అన్నారు. ఎన్టీఆర్ తర్వాత నేను అభిమానించే వ్యక్తి జగన్ అని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu