ఈనెల 20 నుండి మిల్లర్ల సమ్మె

Kharif Season, Rice Millers, Strike from 20th October, Power Problems, Farmers In Dilemma, Rice Purchase, Indira Kranthi Scheme, Civil Supplies Department, Agriculture Co-op Societies, Indian Food Corporation, Electricity Charges,

రాష్ట్రంలో ఖరీఫ్ సాగు  చేసిన రైతులను ఇంకా సమస్యలు ఛుట్టుముడుతూనే ఉన్నాయి. అనేక వ్యయప్రయాసకోర్చి పంట పండించిన రైతులు ఇప్పుడు మిల్లర్లనుండి  అడ్డంకులను  ఎదురుకుంటున్నారు. ప్రతిసారీ లానే  ఈ ఏడాది వారు కరెంటును సాకుగా తీసుకుంటున్నారు. దీని వల్ల రైతులు ఆందోళనలో ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుస్తున్న  ధాన్యం కొనుగోలుకు ఒక ప్రక్క ఇందిరా క్రాంతి పధకం, పౌరసరఫరాల శాఖ, ప్రాధమిక  వ్యవసాయ సహకార సంఘాలు, భారత  ఆహార సంస్ద 1779 కేంద్రాలు సిద్దంగా ఉన్నాయని  ప్రభుత్వం ప్రకటించింది. కానీ మిల్లర్లు మాత్రం కొనుగోలు చేయలేమిని పెరిగిన విద్యుత్ చార్జీల వల్ల మిల్లింగ్ చేయడం కష్టమని తేల్చింది.  ప్రతి ఏడాది ఐకెపి, పౌరసరఫరాల శాఖ, ఎఫ్ సి ఐ  సహకార సొసైటీలు సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసేందుకు మిల్లర్లకు అందిస్తారు. వాటిని మిల్లింగ్ చేసి మిల్లర్లు ఎఫ్ సి ఐకి అప్పగిస్తారు. ఇందుకు గానూ ప్రతి క్వింటాలుకు 15 రూపాయలు ఎఫ్ సి ఐకి  మిల్లర్లకు చెల్లిస్తుంది. రాష్ట్రంలో 6 వేల రైస్ మిల్లులుండగా, ఏటా కోటి మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తాయి. పెరిగిన విద్యుత్ చార్జీల వల్ల మిల్లింగ్ చేయలేమని, అంతే కాకుండా 60శాతం కంటే ఎక్కువగా విద్యుత్ ను వినియోగించరాదని, ట్రాన్స్ కో మిల్లర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఆదేశాలను అతిక్రమిస్తే 10 రెట్లు జరిమానా తప్పదని హెచ్చరించింది. రోజంతా మిల్లింగ్ చేస్తే 2 లకల వరకు విద్యుత్ బిల్లులకు ఖర్చు అవుతుందని అదే పది రెట్లు జరిమానా వేస్తే 12 లకలు చెల్లించాల్సి వస్తుందని, అలాగే నిరంతర కరెంటు లేక పోతే నూకలు వస్తాయని వారు చెబుతున్నారు. ఆరుగాలం శ్రమించిన రైతులకు  ఇది శరాఘాతంగా తగులుతుందని ఆందోళన చెందుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu