కేకేకి, కాకాకి ‘బాత్‌రూమ్’ గండం

 

 

 

తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన యోధులను ‘బాత్‌రూమ్’ గండం పట్టి వేధించింది. ఇద్దరు ప్రముఖ తెలంగాణ నాయకులు బాత్రూమ్‌లో కాలు జారి పడిపోవడం వల్ల ఆస్పత్రి పాలయ్యారు. వాళ్ళలో ఒకరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి జి.వెంకటస్వామి కాగా, మరొకరు టీఆర్ఎస్‌లో కీలక వ్యక్తిగా మారిన మాజీ కాంగ్రెస్ నాయకుడు కె.కేశవరావు. ఈ ఇద్దరిలో వయోవృద్ధుడైన వెంకటస్వామి రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి సమీపంలోని తన వ్యవసాయ క్షేత్రంలోని బాత్‌రూమ్‌లో జారిపడ్డారు. ఈ సంఘటనలో ఆయన కాలు విరిగింది. ఆయన్ని హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. వెంకటస్వామికి కుడి మోకాలు పైన ఎముక విరిగింది. అలాగే సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులు నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న కె.కేశవరావు అక్కడ టాయిలెట్‌కి వెళ్ళి జారి పడిపోయారు. ఆయన్ని కూడా ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. కేశవరావుకు గాయాలయ్యాయా, లేదా అనే విషయం ఇంతవరకు తెలియరాలేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News