నేడు కెసిఆర్ జన్మదినం ...

 

 

 

రామ్ లీలా మైదాన్ లో నేడు ఎ.పి.ఎన్.జీ.వో.ల సమైక్యాంద్ర సభ తలపెట్టింది. దీనికి ఆంధ్రప్రదేశ్ నలుమూలలనుండి ఎపిఎన్.జి.వో. లు విద్యార్థి జెఎసి నాయకులు విద్యార్థులు భారీగా తరలి వచ్చారు. అలాగే నేడు కెసిఆర్ జన్మదినం సందర్భంగా ఇటు తెలంగాణా నుండి కూడా కార్యకర్తలు జెఎసి నాయకులు తుగ్లక్ రోడ్డులోని కెసిఆర్ ఇంటికి వెళ్ళి ఆయనకు శుభాకాంక్షలు అందజేయనున్నారు. దీంతో ఏ సమయంలో ఎలాంటి గొడవలు తలెత్తుతాయోనని ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే రామ్ లీలా మైదాన్ సమైక్యాంధ్ర కార్యకర్తలు, ఎపిఎన్.జి.వో.లతో నిండిపోయింది.