తెలంగాణా ప్రజలకు కేసీఆర్ భరోసా
posted on Feb 4, 2014 9:25AM
.jpg)
తెలంగాణా బిల్లుకి బీజేపీ మద్దతు ఇచ్చే అంశంపై మీడియాలో వస్తున్నరకరకాల వార్తలు, కధనాలు తెలంగాణావాదులకు, ప్రజలకు చాలా ఆందోళన కలిగించడం సహజమే. టీ-కాంగ్రెస్ నేతలందరూ వాటిని ఎంత గట్టిగా ఖండిస్తున్నా, వారందరూ ఒకే కాంగ్రెస్ తానుకి చెందినవారు గనుక తెలంగాణా ప్రజలు వారి మాటలను నమ్మేందుకు సిద్దంగా లేరు. అందుకే కేసీఆర్ వెంటనే మీడియా ముందుకు వచ్చి బీజేపీ మద్దతుపై వస్తున్నవార్తలను నమ్మనవసరం లేదని, బీజేపీ తప్పకుండా తెలంగాణా బిల్లుకి మద్దతు ఇస్తుందని, ఈ పార్లమెంటు సమావేశాలలోనేబిల్లు ఆమోదం పొందడం, ఎన్నికలలోగా తెలంగాణా రాష్ట్రం ఏర్పడటం ఖాయమని ఆయన భరోసా ఇచ్చారు. అయితే ఎంతగా భరోసా ఇస్తున్నపటికీ, బీజేపీ నేతలు స్వయంగా మీడియా ముందుకు వచ్చి చెపుతున్న మాటలు మారిన వారి ఆలోచనలకు అద్దంపడుతున్నాయి.