సిద్దరామయ్య ముఖ్యమంత్రి పదవికి గండం..! రేసులో ఇద్దరు..

 

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు పదవికి గండం తప్పనుందా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. దీనికి కారణం కాంగ్రెస్ అధిష్టానం సిద్దరామయ్యపై తీవ్ర అసంతృప్తితో ఉండటమే. అందుకే ముఖ్యమంత్రిగా మరో నేతను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు కాంగ్రంస్ చేస్తున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గత కొద్దికాలంగా సిద్దరామయ్యపై పలు ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే.. అంతేకాదు తన కొడుకుకి కాంట్రాక్టులు కట్టబెట్టడంపై కూడా అధిష్టానం చాలా సీరియస్ గా ఉందట.. దీనితోపాటు బీజేపీ విభాగం పగ్గాలు మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప తిరిగి చేపట్టడం కూడా కాంగ్రెస్ లో గుబులు రేగడానికి ఒక కారణంగా తెలుస్తోంది. మరోవైపు ఈ ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత ఎస్ ఎం కృష్ణతోపాటు, ప్రస్తుతం ఆ రాష్ట్ర హోం మంత్రిగా ఉన్న జి.పరమేశ్వర పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి పీఠం ఎవరిని వరిస్తుందో చూడాలి.