మళ్ళీ రెచ్చిపోయిన కాకుమాను కుక్కలు

 

గుంటూరు జిల్లా కాకుమానులో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మూడు రోజుల క్రితం పది కుక్కలు ఒక్కటై ఆరేళ్ళ బాలిక కౌసర్‌ని దారుణంగా చంపేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన తర్వాత మంత్రి ప్రత్తిపాటి పిచ్చికుక్కలను పట్టుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అయితే ఇప్పటి వరకు ఆ ఆదేశాలకు కార్యరూపం దాల్చలేదు. దాంతో ఇదే గ్రామంలో మరోసారి పిచ్చికుక్కలు స్వైర విహారం చేశాయి. ఈసారి ఈ కుక్కల దాడిలో ఒక లేగదూడ మరణించింది. మరో లేగదూడ తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనలో ఈ గ్రామంలో ప్రజలు భయభ్రాంతులు అయ్యారు. ఇప్పటికైనా కుక్కలను అదుపు చేయాలని విజ్ఞప్తి చేశారు. కుక్కలు మరోసారి బీభత్సాన్ని సృష్టించకముందే అధికారులు మేల్కొనాలని అంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu