8న పరువుల.. 11న జ్యోతుల.. టీడీపీ ఎంట్రీ..

 

వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ టీడీపీలో చేరుతున్న సంగతి తెలిసిందే. ఈవిషయాన్ని పరవుల సుబ్బారావు కూడా చెప్పారు. తాను, జ్యోతుల నెహ్రూ ఓ మంచిరోజు చూసుకొని టీడీపీలో చేరుతున్నట్టు చెప్పారు. అయితే ఇప్పుడు మంత్రి యనమల వారు చేరికపై తేదీలను ప్రకటించారు. ఈ నెల 8వ తేదీన పరువుల సబ్బారావు.. నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు జ్యోతుల నెహ్రూ టీడీపీలో చేరుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావులు వరుసగా జగ్గంపేట, పత్తిపాడు నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.