పార్టీకి హాజరుకావాల్సిందే.. చంద్రబాబు

 

మార్చి 22న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుల మనవడు లోకేశ్, బ్రహ్మణీల తనయుడు దేవాన్ష్ బర్త్ డే జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆరోజు హైదరాబాదులోని తాజ్ కృష్ణాలో ఘనంగా నిర్వహించినా..మళ్లీ ఈ నెల 8న ఉగాది పండుగు రోజున తిథుల ప్రకారం మరోసారి జరపనున్నారు.  ఈకార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించనున్నారు. అయితే ఈ పార్టీకి ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ తప్పకుండా హాజరుకావాల్సిందేనని ఆయన ఆహ్వానం పలికారు. దాదాపు 1,500 మంది హాజరుకానున్న ఈ విందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.