జూనియర్ ఎన్టీఆర్... ఒక మంచి ఓటరు.. భార్యతో కలసి ఓటు!

 

తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయడానికి ఎన్టీఆర్ దూరంగా వున్నాడు. ఎవరు ఎంతగా అడిగినా, బొట్టుపెట్టి పిలవాలా అన్నా పట్టించుకోకుంటా అజ్ఞాతంలో వుండిపోయాడు. ప్రచారానికి రాకున్నప్పటికీ ఓటు వేయడానికి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ముందుండి మంచి ఓటరని అనిపించుకుంటున్నాడు. బుధవారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగానే హైదరాబాద్‌లోని గాయత్రి హిల్స్ లో వున్న పోలింగ్ కేంద్రానికి తన భార్య లక్ష్మీ ప్రసన్నతో కలసి వచ్చి జూనియర్ ఎన్టీఆర్ ఓటు వేశాడు. బాధ్యతగల ఓటరుగా ఓటు వేయడానికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ అభినందనీయుడు.