మీకో నమస్కారం.. ఇష్టం వచ్చినట్టు చేసుకోండి.. జేసీ

 

అనంతలో జేసీ బ్రదర్స్ కు ప్రభాకర్ కు మధ్య విబేధాలు ఉన్న సంగతి తెలిసిందే. గతంలో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్న వీరు.. ఇప్పుడు మరోసారి జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి తిట్టుకున్నారు. అనంతపురం కార్పొరేషన్ సమావేశం సందర్భంగా.. ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఇద్దరు నేతలూ గట్టిగా కేకలు పెట్టుకున్నారు. బ్రిడ్జ్ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని, అయితే, కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా పనులు ఆలస్యమవుతుంటే, ఎంపీ రాజకీయ లబ్దికి యత్నిస్తున్నారని ప్రభాకర్ ఆరోపించారు. అసలే జేసీ దివాకర్ రెడ్డికి కోపం ఎక్కువ.. ఆయన కూడా తిరిగి కేకలు వేశారు. అసలా సాంకేతిక సమస్యలే మీ వల్ల వచ్చాయంటూ విరుచుకుపడ్డారు. అక్కడితో ఆగకుండా.. "ప్రజల కష్టాలు తీర్చాలని అనుకున్నాను. నాదే తప్పు. ఇక మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మీకో నమస్కారం" అంటూ అక్కడి నుండి వెళ్లిపోయారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News