మరోసారి ఉగ్రవాదుల చొరబాటు..

 

పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాదులు ఇప్పటికే భారత్ లో ప్రవేశించడానికి ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి చొరబడేందుకు ప్రయత్నించారు. వివరాల ప్రకారం.. జ‌మ్ముక‌శ్మీర్‌లోని తంగ్‌ధ‌ర్ సెక్టార్‌లోకి ఉగ్రవాదులు చొరబడేందుకు ప్ర‌య‌త్నించగా.. భార‌త జ‌వాన్లు తిప్పికొట్టారు. ఈ క్ర‌మంలో ఉగ్ర‌వాదుల‌కు, భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు మ‌ధ్య కాల్పులు జ‌రగగా.. ఘ‌ట‌న‌లో ఒక జ‌వాను అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌గా, మ‌రో జ‌వానుకి తీవ్ర‌గాయాల‌య్యాయి. ఉగ్ర‌వాదుల‌ను హ‌త‌మార్చ‌డానికి జ‌వాన్లు ప్ర‌య‌త్నిస్తున్నారు.