ఒడిశా ప్రమాదంపై చినరాజప్ప దిగ్భ్రాంతి..

గుంటూరు జిల్లాకు చెందిన యాత్రికుల బస్సు ఒడిశాలో ప్రమాదానికి గురైన సంఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒడిశా సర్కార్‌తో మాట్లాడి క్షతగాత్రులకు సాయమందించాలని ఆయన ఏపీ విపత్తు నిర్వహణ అధికారులను, పోలీసులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన డీజీపీ జేవీ రాముడు ఒడిశా డీజీపీతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకుని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. దీనితో పాటు యాత్రికులను తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు పంపేలా చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu