భార్య ముందే భర్తని కాల్చి చంపిన తల్లిదండ్రులు...

 

రాజస్ధాన్‌లోని జైపూర్‌ లో దారణమైన ఘటన చోటుచేసుకుంది. తన కూతురి ఇంటికి వచ్చిన తల్లి దండ్రులే అల్లుడిని చంపిన ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం... రాజస్ధాన్‌లోని జైపూర్‌లో సివిల్ ఇంజనీర్ అయిన అమిత్‌ . జైపూర్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే అమిత్ కు తమ ఇంటి పక్కనే ఉన్న మమత చౌదరి(30) తో పరిచయం ఏర్పడి.. అదికాస్త ప్రేమగా మారి ఏడాదిన్నర క్రితమే పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరూ  జైపూర్‌లోనే కాపురం పెట్టారు. ఈ నేపథ్యంలో గత కొద్ది కాలంగా వారి కుటుంబానికి దూరంగా ఉన్న  మమత చౌదరి తల్లిదండ్రులు...  మమత గర్భవతి అని తెలిసి మమతను కలిసేందుకు ఇంటికి వచ్చారు. అమిత్‌ను వదిలేసి తమతో వచ్చేయాలంటూ బలవంతపెట్టారు. మమత ప్రతిఘటించడంతో ఆమె తల్లిదండ్రులు తీసుకొచ్చిన ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి వెళ్లి అమిత్‌పై కాల్పులు జరిపారు. దీంతో తీవ్ర గాయాలపాలైన అమిత్ ను ఆస్పత్రికి తీసుకెళ్లగా... రక్తం ఎక్కువగా పోవడంతో అమిత్ చనిపోయినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. మరోవైపు అమిత్ చనిపోయిన అనంతరం..మమత తల్లిదండ్రులు పరారయ్యారు. కళ్ల ముందే తన భర్తను కాల్చి చంపారని మమతా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వారికోసం దర్యాప్తు చేస్తున్నారు.