శంఖుస్థాపనకి నన్ను పిలవద్దు...పిలిచినా నేను రాను: జగన్
posted on Oct 15, 2015 2:44PM
.jpg)
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఈరోజు ఒక బహిరంగ లేఖ వ్రాసారు. రాజధాని అమరావతి శంఖుస్థాపనకు ఆహ్వానిస్తూ తనకు ఎటువంటి లేఖ పంపవద్దని కోరారు. ఒకవేళ ఆహ్వానించినా తను హాజరుకానని తెలిపారు. ఆహ్వానం పంపించి ఆ తరువాత తను రానందుకు నిందించవద్దని అన్నారు. రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కొని దానిపై రాజధాని నిర్మించడాన్ని తను మొదటి నుండి వ్యతిరేకిస్తున్నానని కానీ ప్రభుత్వం పట్టించుకోకుండా అక్కడే రాజధాని నిర్మిస్తున్నందున నిరసనగా తను ఈ కార్యక్రమానికి హాజరుకాదలచుకోలేదని వ్రాసారు. రాజధాని ప్రాంతంలో అప్రకటిత కర్ఫ్యూ ఎందుకు విధించారని ముఖ్యమంత్రిని జగన్ తన లేఖలో ప్రశ్నించారు. రైతుల ఉసురు పోసుకొని రాజధానిని నిర్మించడాన్ని తను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని అందుకే నిరసనగా తను శంఖుస్థాపన కార్యక్రమానికి హాజరు కాదలచుకాలేదని తెలిపారు.