ఐసిస్.. బాంబుల తయారీలో అగ్గిపుల్లల మందు..

ఎన్ఐఏ ఇటీవలే ఐఎస్ఐఎస్ లో చేరినట్లు అనుమానించి16 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరిని విచారించిన పోలీసులకు పలు ఆసక్తికర విషయాలు తెలిసాయి. అవేంటంటే.. ఉగ్రవాదులు గత ఏడు నెలలుగా అగ్గిపుల్లల్లోను, దీపావళి టపాసుల్లోను ఉపయోగించే రసాయనాలు సేకరించి.. వాటితో బాంబులు తయారుచేస్తున్నారట. అంతేకాదు వారి దగ్గర నుండి స్వాధీనం చేసుకున్న బాంబులలో ఈ రసాయనాలు ఉన్నట్టు గుర్తించారు. సాధారణంగా అగ్గిపుల్లల చివర ఉండే మందులో పొటాషియం క్లోరేట్‌ను వాడతారు.. దీపావళి సామగ్రి తయారీలో పొటాషియం నైట్రేట్‌ను వాడతారు. వీటి ద్వారా తయారు చేసిన బాంబులను పలు చోట్ల దాడులకు ఉపయోగించాలని చూస్తున్నారట. అంతకుముందు అమోనియం నైట్రేట్‌ను ఎక్కువగా ఉపయోగించేవాళ్లు. తర్వాతి కాలంలో దాని అమ్మకాలపై ప్రభుత్వం నియంత్రణలు విధించింది. దాంతో ఇప్పుడు ఈ పదార్థాలపై ఉగ్రవాదుల కన్నుపడింది.