మళ్లీ బాంబు బెదిరింపు

అస్ట్రేలియా రాజధాని సిడ్నీలోని పాఠశాలలకు మరోసారి బెదిరింపు కాల్స్ రావడంతో పాఠశాలలను మూసేశారు. గంతలో కూడా క్రిస్మస్‌ సెలవుల తర్వాత ఇలాగే బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇప్పుడు మరోసారి బెదిరింపు కాల్స్ రావడంతో అధికారులు పాఠశాలలను ఖాళీ చేయించి.. స్కూళ్ల నుంచి విద్యార్థులను పంపేసి.. 8 పోలీసు బృందాలు విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నారు. ఈ సందర్బంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ.. బెదిరింపు కాల్స్ పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని.. ఇలాంటి బెదిరింపులకు పాల్పడడం చాలా తీవ్రమైన నేరమని, కాల్స్‌ చేసే వారినందరినీ కచ్చితంగా గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.